నాకేమీ ఢోకా లేదు: వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై సిఎం

Rosaiah
హైదరాబాద్: ఓదార్పు యాత్ర తీరుపై తప్ప మిగతా ఏ విషయాల్లోనూ కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర వల్ల తలెత్తిన పరిణామాల వల్ల తన ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. జగన్ తో తనకు అభిప్రాయ భేదాల్లేవని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ నెమ్మదిగా పరిస్థితులను, అధిష్ఠానం అంతరంగాన్ని అర్థం చేసుకొని నడుచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబాల్లో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు వచ్చి సమసిపోయినట్లే ఇది కూడా ముగిసిపోతుందని ఆయన ఆదివారం ఓ ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

రాష్ట్ర కాంగ్రెసులో కొందరితో అభిప్రాయ భేదాలున్నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఏనాడూ అధిష్ఠానాన్ని ధిక్కరించలేదని రోశయ్య చెప్పారు. పరిస్థితులను అంచనా వేసి అధిష్ఠానం మనసెరిగి తనను తాను మలుచుకోవాలని జగన్‌కు సలహా ఇవ్వడం తప్ప తానేమీ చెప్పలేనన్నారు. వైఎస్‌కు ఆత్మీయుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావు అధిష్ఠానం ఆలోచనలకు భిన్నంగా నడిచే వ్యక్తి కాదని, జగన్‌ను దారిలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి, పార్టీకి, నష్టం కలగకుండా తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+