హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నాయుడు బాబ్లీ బస్సు యాత్ర ప్రారంభం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ అక్రమ కట్టడాలను నిరసిస్తూ తెలుగుదేశం చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్రలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోక్‌సత్తా సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం, లోక్‌ సత్తా సభ్యులతో కూడిన నాలుగు బస్సులు అసెంబ్లీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మహారాష్ట్ర అక్రమ కట్టడాలపై దేశవ్యాప్త చర్చ జరగాలనే ఉద్దేశంతోనే ఈ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలనూ మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడమని చెప్పారు. ఈ వ్యవహారంపై యుపిఎ చైర్ పర్సన్ సోనియా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. కేంద్రం దిగి వచ్చేవరకు యాత్ర ఆపేది లేదని ఆయన అన్నారు.

ఈ నెల 23వ తేదీన అఖిల పక్షంతో భేటీ అయ్యేందుకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంగీకరించినందున యాత్ర ఆపేయాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఫోన్ చేసి చంద్రబాబును కోరారు. అయితే, బాబ్లీని ఆపుతామని నిర్దిష్టమైన హామీ ఇస్తేనే బస్సు యాత్ర ఆపుతామని చంద్రబాబు చెప్పారు. కాగా, తెలుగుదేశం ప్రతినిధులు బాబ్లీ వరకు రాకుండా అడ్డుకునేందుకు మహారాష్ట్రలో ఏర్పాట్లు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వరకు బస్సు యాత్రకు రక్షణ కల్పిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X