వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మహా' మోసం: చంద్రబాబు నాయుడు సహా టిడిపి నేతల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ధర్మాబాద్: మహారాష్ట్ర పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను నమ్మించి మోసం చేశారు. బాబ్లీ ప్రాజెక్టు వద్దకు తీసికెళ్తామని చెప్పి అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా పది మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. బాబ్లీ ప్రాజెక్టు చెంతకు బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు అనుమతిస్తామని చెప్పి చంద్రబాబు సహా పది మంది నాయకులను పోలీసులు తమ వాహనంలో ఎక్కించారు. కొంత దూరం వెళ్లాక వారిని అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబును, ఇతర నాయకులను అరెస్టు చేసి పోలీసులు ధర్మాబాద్ పోలీసు స్టేషనుకు తరలించారు.

తమ పార్టీ నాయకుల అరెస్టు వార్త విన్న వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగి సరిహద్దు దాటిన కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మహారాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మొత్తం 76 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ నేత చంద్రబాబును వదిలేసిన తర్వాతనే తాము కదులుతామంటూ తెలుగుదేశం కార్యకర్తలు సరిహద్దులో బైఠాయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X