ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నాయుడు బస్సు యాత్రతో ఢీకి మహారాష్ట్ర రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఆదిలాబాద్: బాబ్లీ ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రారంభమైన బస్సు యాత్రను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి తమ రాష్ట్ర సరిహద్దుల్లోకి తెలుగుదేశం పార్టీ నాయకులను అనుమతించేందుకు మహారాష్ట్ర సిద్ధంగా లేదు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీతో పాటు 13 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని, వాటిని అడ్డుకోవడంలో తమ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఈ బస్సు యాత్రను ప్రారంభించింది. బస్సు యాత్రను అడ్డుకునేందుకు బిరిజెల్లి వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. దాదాపు రెండు వేల మంది సిబ్బందిని అందుకు నియోగించింది.

తెలుగుదేశం పార్టీ నాయకులను బాబ్లీ వరకు అనుమతించేది లేదని బాబ్లీ బచావో సంఘర్షణ సమితి కార్యకర్తలు కంకణం కట్టుకుని ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో బారికేడ్లను, చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కాగా, చంద్రబాబు తమ పార్టీ నాయకులతో, లోక్ సత్తా నాయకులతో కలిసి గురువారం ఉదయమే బాబ్లీకి బస్సు యాత్రను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో గురువారం ఉదయం చంద్రబాబు తన బృందంతో ఓ హోటల్ లో టిఫిన్ చేసి బాబ్లీవైపు సాగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X