హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై నేను చెప్పేదేమీ లేదు: వీరప్ప మొయిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై చెప్పేదేమీ లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. తన పుస్తకం ఆవిష్కరణకు హైదరాబాదు వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని వైయస్ జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. దీనిపై అధిష్టానం ప్రత్యేకంగా ప్రతిస్పందించేదేమీ లేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కె. రోశయ్యపై జగన్ చేసిన విమర్శలపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ విమర్శలకు రోశయ్య సమాధానం చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల ప్రచార సభలో తాను పాల్గొనడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య, మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్ రావు, వి. హనుమంతరావు తదితరులు మొయిలీని కలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X