కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు బాబ్లీ బస్సు యాత్రపై పొన్నం ప్రభాకర్ మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
కరీంనగర్: బాబ్లీ బస్సు యాత్రను చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ స్వార్థంతోనే బాబ్లీ సమస్యను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ నెల 23వ తేదీన బాబ్లీ సమస్యపై ప్రధాని డాక్టర్ మన్నోహన్ సింగ్ తో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినా తెలుగుదేశం పార్టీ కావాలనే యాత్రను చేపట్టిందని ఆయన విమర్శించారు.

ప్రధానితో జరిగే అఖిల పక్ష సమావేశంలో ఐక్యంగా గొంతు వినిపించడానికి తెలుగుదేశం పార్టీ కలిసి రావాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రాంద రైతులకు అన్యాయం జరగకుండా కృషి చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X