హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబ్లీ ప్రాజెక్టుపై చంద్రబాబుకు తొందరేమిటి: వి హనుమంతరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తొందరేమిటని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ప్రశ్నించారు. బాబ్లీకి వెళ్లే సందర్భం కూడా ఇది కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ నెల 23వ తేదీన బాబ్లీ ప్రాజెక్టుపై రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష బృందంతో మాట్లడడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రధాని సమయం కూడా తీసుకున్నారని, ఇటువంటి సందర్భంలో చంద్రబాబు బస్సు యాత్రను చేపట్టారని ఆయన అన్నారు.

మహారాష్ట్రలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బృందానికి ఏమైనా జరిగితే ఎలా ఉంటుందని ఆయన అడిగారు. ఇప్పటికే సోంపేట సంఘటన జరిగిందని, ఇప్పుడు ఏమైనా జరిగితే పరిస్థితి దెబ్బ తింటుందని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని ఆయన అన్నారు. అప్పుడే చంద్రబాబు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు బస్సు యాత్ర చేయాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన అన్నారు. చంద్రబాబు బస్సు యాత్ర అనవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X