చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష: టిడిపి నేతలకు అస్వస్థత

చంద్రబాబు పరిస్థితి కూడా అంత సజావుగా ఏమీ లేదు. అయినా ఆయన దీక్ష సాగిస్తున్నారు. దాదాపు పది మంది శాసనసభ్యులు అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకుల జ్యుడిషియల్ కస్టడీ సోమవారం సాయంత్రం ముగుస్తుంది. దీంతో వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత వారిని నాందేడ్ జైలుకు తరలించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. మరో వైపు చంద్రబాబును బాబ్లీ ప్రాజెక్టు వద్దకు తీసికెళ్లే ఆలోచన కూడా మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కాగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మహారాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications