హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటాం: పాటిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

RR Patil
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విషయంలో వచ్చే 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ చెప్పారు. రాష్ట్ర శాసనసభలో ఆయన మంగళవారం ఈ విషయం చెప్పారు. చంద్రబాబును ఔరంగాబాద్ జైలుకు తరలించడం తాత్కాలికమేనని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబును అనుమతించే ప్రశ్నే లేదని మహారాష్ట్ర మొండికేసింది.

చంద్రబాబుతో పాటు 34 మంది తెలుగుదేశం నాయకులను బస్సులో ఔరంగాబాద్ జైలుకు తరలిస్తున్నారు. వారు ఔరంగాబాద్ జైలుకు చేరుకోవడానికి కనీసం మరో మూడు గంటలు పట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతియుతంగా ఆందోళనలు జరపాలని, విధ్వంసాలకు, హింసకు పాల్పడవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ హక్కును రాజకీయ పోరాటం ద్వారా సాధించుకుందామని ఆయన చెప్పారు. కాగా, బస్సులోని తెలుగుదేశం నాయకులకు పోలీసులు ఆహారం కూడా అందించడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X