హై కమాండ్ తీరుపై వైయస్ జగన్ అసహనం

YS Jagan
రాజమండ్రి: తమ పార్టీ అధిష్టానంపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు అసహనం వ్యక్తం చేశారు. ఆయనలో క్రమంగా అసహనం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నారు. అంబటి రాంబాబు సస్పెన్షన్ తో ఆయనలో ఈ అసహనం మొదలైంది. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం బాధతో చనిపోయినవారు కాంగ్రెస్‌ కార్యకర్తలు కాదంటూ, అసలెవరూ చనిపోలేదంటూ, కొందరు నీచమైన మాటలు మాట్లాడుతున్నారని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. ఎనిమిదో రోజు ఓదార్పుయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పందలపాకలో ఆయన సోమవారం ఆ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ మరణాన్ని జీర్ణించుకోలేక బాధతో చనిపోయిన కుటుంబాలను ఓదారుస్తుంటే దండయాత్ర చేస్తున్నారని కొందరు నాయకులు విమర్శిస్తున్నారని, అలాంటివారిని ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర ప్రారంభమైన తర్వాత ముందు రోజు ఎంత ఆలస్యమైనా సుమారు 10 గంటల సమయంలో యాత్ర ప్రారంభిస్తున్న జగన్‌ సోమవారం మాత్రం 11.30 గంటలకు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి గొల్లల మామిడాడలో బసచేసిన జగన్‌ అంబటి సస్పెన్షన్‌ ఉదంతం తర్వాత పరిణామాలపై జిల్లాకు చెందిన నాయకులతో సుదీర్ఘంగా చర్చించడంతో పాటు, మున్ముందు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ఫోన్‌లో కేవీపీ, ఉండవల్లి వంటి సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. సోమవారం నాటి ఓదార్పు యాత్ర అనపర్తి, మండపేట నియోజకవర్గాల్లో సాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+