హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు మంచి భవిష్యత్తు ఉంది: పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మంచి భవిష్యత్తు ఉందని, జగన్ భవిష్యత్తు ఉన్న నాయకుడని పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. జగన్ ఓదార్పు యాత్రకు ఆయన మద్దతు పలికారు. తండ్రి మరణించినప్పుడు ఇచ్చిన మాట కోసం జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ వైయస్ ఆశయాల సాధన కోసం పని చేయాలని ఆయన సూచించారు.

తూర్పు గోదావరి జిల్లా దిండిలో శుక్రవారం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ప్రసాదరాజు, రాపాక వరప్రసాద్, మాజీ మంత్రి హరిరామ జోగయ్య, పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు జగన్ ను కలిసి ఓదార్పు యాత్రకు మద్దతు తెలిపారు. ఆరోగ్యం విషయంలో జగన్ జాగ్రత్తలు తీసుకోవాలని హరిరామ జోగయ్య సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X