బయ్యారం గనుల లీజు రద్దు: వైయస్ జగన్ కు షాక్
ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో బయ్యారం గనుల అక్రమాలపై విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి రోశయ్య చేసిన సూచనను మంత్రులు వ్యతిరేకించారు. మంత్రి వట్టి వసంత కుమార్ దీనిపై ఇప్పటికే ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించినందున విచారణ అనవసరమని చేసిన సూచనకు ఇతర మంత్రులెవరూ స్పందించలేదు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని 1.40 లక్షల ఎకరాల్లో గనుల అక్రమాలు జరుగుతుండడం పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని తెలంగాణ నేతలు వాదించారు. కొందరు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తమ వాదన వినిపించారు. పెద్దమొత్తంలో ఇనుప ఖనిజాన్ని ఒక ప్రయివేటు కంపెనీకి కారుచౌకగా ప్రభుత్వ సంస్థ ఎన్ఎండిసి ద్వారానే కట్టబెట్టే ఒప్పందంపై నేతలు మండిపడ్డారు. ఇదేసమయంలో కొందరు ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్ళారు. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం లీజును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.