వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యం: కేశవరావు

By Santaram
|
Google Oneindia TeluguNews

Keshav Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సీనియర్ కాంగ్రెసు నాయకులు ఉప్ప ఎన్నికల తర్వాత గళం విప్పుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని కాంగ్రెసు‌ సీనియర్‌ నాయకుడు కే. కేశవరావు అన్నారు. ఇలాంటి ప్రజా తీర్పును తన రాజకీయ జీవితంలో ఇంతవరకు ఎన్నడూ చూడలేదని కేకే తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

డిసెంబర్‌ 9 తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు‌ వాదులంతా కట్టుబడి వున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు‌ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వడం వల్లే, మా ఎమ్యెల్యేలు రాజీనామా చేయలేదన్నారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైన అంశమని, ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆంధ్రానేతల్ని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి త్వరలోనే సోనియాను కలిసి చర్చిస్తామని కేకే స్పష్టం చేశారు. తెలంగాణపై వాదనలకు, చర్చలకు కాలం చెల్లిందన్నారు. అంతేకాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు‌ పార్టీ అధినేత్రి సోనియా అనుకూలమని కేకే చెప్పారు. రాజకీయ వ్యవస్థ విఫలమైందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కార్యచరణ ప్రారంభించి ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X