హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితోపాటు దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, మేయర్ కార్తీకారెడ్డిలు ఉన్నారు.
ఎంతో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రోశయ్యకు ఈ ఉత్సవాలు మంచి ఓదార్పును ఇచ్చి ఉంటాయి. త్వరలో ఆయన మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఆయనకు అనుకూలురైన ఎమ్మెల్యేలు ఆయనకు బాసటగా ఉన్నారు.