వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు గ్రూపులుగా తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెసు ఎంపిలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెసుకు చెందిన తెలంగాణ, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రెండుగా విడిపోయారు. ఢిల్లీలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలంతా ఒక జట్టుగా సీనియర్‌ నేతల ఇళ్ళలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని గూర్చి చర్చిస్తుండగా, సీమాంధ్ర చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు తమదైన వ్యూహ రచన చేసేందుకు మంగళవారం నాడు కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశం కానున్నారు. సోమవారం రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమై ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన సాధ్యమైనంత త్వరగా వచ్చేలా అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి తెలంగాణ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌ను వివరించాలనీ, అంతకుముందే అహ్మద్‌పటేల్‌ను కూడా కలవాలని వారు నిర్ణయించారు. సీమాంధ్ర నేతలకు నచ్చజెప్పేందుకు కృషి చేస్తానని కేశవరావు వారికి చెప్పినట్లు సమాచారం.

పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఇవాళ విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ను కలిసి తామంతా (కోస్తా, సీమాంధ్ర ఎంపీలు) మంగళవారం కలవదలచామని చెప్పగా, అందుకు ఆయన అంగీకరించారు. అదే రోజు రాత్రి వారంతా కావూరి సాంబశివరావు నివాసంలో భేటీ అయి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు చేస్తున్న వ్యూహరచనకు 'కౌంటర్‌' వ్యూహాన్ని రచించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, తెలంగాణ సెంటిమెంటును దృష్టిలో పెట్టకుని రాష్ట్ర విభజన చేసినప్పటికీ హైదరాబాద్ విషయం ఆలోచించాలని సోనియాకు చెప్పనున్నట్లు ఒక సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X