వైయస్ జగన్ వర్గం ఎదురు దాడి: అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు

పార్టీ నిబంధనావళికి వ్యతిరేకంగా తనను సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. తనను ఈ నెల 6వ తేదీన హాజరు కావాలని క్రమశిక్షణా సంఘం ఎందుకు పిలిచిందో తెలియదని ఆయన అన్నారు. తాను పార్టీ నిబంధనావళికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. కురు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే పెద్దలెవరూ మాట్లాడనట్లుగానే నిబంధనావళికి వ్యతిరేకంగా తనను సస్పెండ్ చేస్తే ఎవరూ మాట్లాడడం లేదని, అందుకే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తనను సస్పెండ్ చేసిన విషయం తనకు తెలియకుండానే మీడియాకు తెలుస్తుందని, గట్టు రామచందర్ రావును కిసాన్ సెల్ పదవి నుంచి తొలిగించివ విషయన ఆయనకు తెలియకుండానే మీడియాకు తెలుస్తుందని అంబటి రాంబాబు అన్నారు. మీడియాకు విషయాలు తెలియజేస్తూ తమకు తెలపడమేమిటని ఆయన అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం అవాస్తవం లేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రకు వెళ్తున్న శాసనసభ్యులను, నాయకులను లక్ష్యంగా చేసుకుని చర్యలకు దిగుతోందని ఆయన అన్నారు. వైయస్ వర్గాన్ని భూస్థాపితం చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. పార్టీలో ఉండే తాము పోరాటం చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications