హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖ సాహితీవేత్త కోవెల సంపత్కుమారాచార్య కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Warangal
హైదరాబాద్‌: ప్రముఖ సాహితీవేత్త కోవెల సంపత్కుమారాచార్య గురువారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన 1933 జూన్ 26వ తేదీన వరంగల్ లో జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం కూడా వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి తొలి పిహెచ్ డీ పట్టా తీసుకుంది ఆయనే. అక్కడే ఆయన తన అధ్యాపక వృత్తిని కొనసాగించారు. పదవీ విరమణ తర్వాత హైదరాబాదుకు తన మకాం మార్చారు.

అలంకార, ఛందో శాస్త్రాల్లో ఆయనది అందె వేసిన చేయి. ఆయన రాసిన తెలుగు ఛందో అలకార శాస్త్ర గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. విశ్వనాథ అసంకలిత సాహిత్యాన్ని సాహిత్య లోకానికి అందించే పనిలో నిమగ్నమైన ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. అలంకార, ఛందో శాస్త్రాలు, తెలంగాణ సాహిత్యం ఆయనకు ప్రియమైనవి. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన అవార్డు తీసుకున్నారు. ఆయన మృతికి ప్రముఖ సాహిత్యవేత్త ఎస్వీ రామారావు సంతాపం ప్రకటించారు. కోవెల మృతి తెలుగు సాహిత్య విమర్శకు తీరని లోటు అని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X