తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట తెచ్చారు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తిరుపతి: శ్రీ వెంకటేశ్వర స్వామికి కాంగ్రెసు ప్రభుత్వం అప్రతిష్ట తెచ్చి పెట్టిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుమలలో అవినీతికి నిరసనగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిపాలనా భవనం ముందు మహాధర్నాలో పాల్గొనడానికి ముందు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుమల అవినీతిపై విచారణ జరిపించడమే కాకుండా టిటిడిని ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతికి కారకులైన వారు ఎంత పెద్దవారైనా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

టిటిడిలో అధికార దుర్వినియోగం పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. టిటిడి ప్రక్షాళన జరిగే వరకు తాము పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. దేవుడిపై నమ్మకం లేనివారిని టిటిడి చైర్మన్ పదవిలో నియమించారని ఆయన విమర్శించారు. అర్హత లేని అధికారులను ఇక్కడ నియమించారని ఆయన అన్నారు. విధిలేని స్థితిలోనే తాము టిటిడి అక్రమాలపై ఆందోళనకు దిగుతున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X