రాష్ట్ర నాయకత్వంపై డిఎస్ నిర్వేదం: హస్తన వైపు చూపు
కాగా, డిఎస్ ను కొనసాగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కొనసాగడానికి ఆయన ఇష్టంగా లేరని తెలుస్తోంది. పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చి, తాను నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయిన తర్వాత పిసిసి పదవి నుంచి తనను తప్పించాలని డిఎస్ అధిష్టానాన్ని కోరారు. అయితే అందుకు అధిష్టానం అంగీకరించలేదు. దాంతో ఆయన ఇప్పటి వరకు కొనసాగారు. తాజాగా, మరోసారి నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయిన తర్వాత ఆయనను మరింత నిర్వేదం ఆవరించినట్లు చెబుతున్నారు. దీంతో తన కోరికను మన్నించాలని ఆయన గట్టిగా కోరినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ కొత్త పిసిసి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. అప్పటి వరకు మాత్రమే డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది.
కాగా, పిసిసి అధ్యక్ష పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి కె. జానారెడ్డి, తాజా మంత్రి జె. గీతారెడ్డి, ఎంపి నంది ఎల్లయ్య, మల్లు రవి తదితరులు పిసిసి పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.