వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పై సోనియా గాంధీ డైరెక్ట్ అటాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారంపై కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. జగన్ ను అన్ని రకాలుగా అణచివేసేందుకు అవసరమైన సూచనలను ఆమె చేస్తున్నారు. ఓదార్పు యాత్రకు ఎవరూ వెళ్లవద్దని తన మాటగా పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు చెప్పాలని ఆమె రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రితో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. శాసనసభ్యులకు తన మాటగా చెప్పాలని ఆమె సూచించినట్లు చెబుతున్నారు. పార్లమెంటు హాల్ లో సోనియా కేంద్ర మంత్రితో ఆమె మాట్లాడారు.

జగన్ ను వ్యతిరేకించేవారని ప్రోత్సహించాలని కూడా ఆమె సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులను గుర్తించాలని ఆమె ఆదేశించినట్లు తెలుస్తోంది. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ఒత్తిడి ఎదుర్కుంటున్న దళిత శాసనసభ్యులకు నచ్చజెప్పాలని ఆమె సూచించారు. రేపు టికెట్లు ఇచ్చేది తామేనని ఆమె చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర రాజకీయ లబ్ధి కోసమే చేపట్టారని ఆమె వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఓదార్పు యాత్ర తీరే ఆ విషయాన్ని తెలియజేస్తోందని, తాను ఓదార్పు యాత్రను తీరును వ్యతిరేకించానని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X