చంద్రబాబు నాయుడి చూపు ఆంధ్రా వైపు: కె. చంద్రశేఖర రావు

గురువారం కేసీఆర్ సమక్షంలో వరంగల్ జిల్లా టిడిపి నాయకుడు దొమ్మాటి సాంబయ్య, ఆ పార్టీ ములుగు జడ్పీటీసీ సభ్యురాలు అలీలా గోవిందనాయక్, కార్పొరేటర్ నన్నపనేని నరేందర్ తదితరులు తెరాసలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ నాయకుడు శంకర్నాయక్, టిడిపి ఆదిలాబాద్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్దన్రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఇటీవల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపా కుట్రలను ప్రజలు చేధించి తీర్పును ఇచ్చారన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాళ్లకింద భూమి కదులుతుండడంతో ఆ పార్టీ నేతలు నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
టిడిపి నాయకులు అసంబద్ధ ప్రేలాపనలు ఆపి తెలంగాణ ప్రజలతో కలసి వస్తారో, చస్తారో తేల్చుకోవాలని కేసీఆర్ సూచించారు. ఉప ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ను ప్రజలు కిందవేసి తొక్కారని, తెలంగాణవాదాన్ని గెలిపించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. రాష్ట్రం ఏర్పడితే 85 శాతం ఉన్న బడుగు, బలహీన, ముస్లిం వర్గాలు బాగుపడుతాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెరాస పార్టీ పనిచేస్తుందన్నారు. ఏ పార్టీలోనూ విలీనం కాదని కేసీఆర్ పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications