హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాంత్ భూమి వివాదం: కాకాపై కేసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

 G Venkataswamy
హైదరాబాద్: సినీ నటుడు శ్రీకాంత్ మరదలి భూ వివాదంలో పోలీసులు మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి (కాకా)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అనుచరులు 30 మందిపై కూడా పోలీసులు కేసులను నమోదు చేశారు. శ్రీకాంత్ మరదలు శాంతికి చెందిన భూమిలో అక్రమంగా జెండాలు పాతారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పోలీసులకు కాకాపై ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం కాకాపై 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు సమాచారం.

శ్రీకాంత్ సోదరుడు అనిల్, మరదలు మేఘ, మరో నటుడు శివాజీలతో కలిసి శ్రీకాంత్ శుక్రవారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పత్రాలను అందజేశారు. గతంలోనూ వెంకటస్వామి బెదిరించారని, జెండాలు పాతి బెదిరించడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు. పట్టా భూమిని తాము చట్టపరంగా కొనుగోలు చేశామని, తమ దగ్గర డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు, పహాణీలు అన్నీ ఉన్నాయని తెలిపారు. పెద్దోళ్లు అయినంత మాత్రాన ఎవరి భూమి పడితే వారిది కబ్జా చేస్తారా? అని ప్రశ్నించారు. తనకు న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేపడతానని చెప్పారు. మీడియా సమక్షంలో భూమి కొనుగోలుకు సంబంధించిన పత్రాలను చూపుతామని, భూమి తమది కాదని నిరూపించే పత్రాలను వెంకటస్వామి చూపిస్తారా? అని సవాల్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X