ఓదార్పు యాత్ర: ఆ ఎమ్మెల్యేలంతా వైయస్సార్ వ్యతిరేకులా?

ఇప్పటికే 9 మంది చేత కమిటీని ఏర్పాటు చేసింది. రూట్ మ్యూప్ కోసమే ఆ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఆయన నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు పోటీ నాయకత్వాన్ని తయారు చేస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. అలాగే, ఓదార్పు కార్యాలయాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఓదార్పు యాత్రపై చర్చించేందుకు ఈ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ వర్గం చెబుతోంది. ఓ పార్టీకి కావాల్సిన హంగులను సమకూర్చుకుంటోంది. ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా అధిష్టానానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, వనబాక లక్ష్మిలపై తీవ్రమైన విమర్శలు కూడా కురిపిస్తున్నారు. మొత్తం మీద, తమ మాట వినని శాసనసభ్యులను, మంత్రులను, కేంద్ర మంత్రులను, నాయకులను ఆత్మరక్షణలో పడేసేందుకు జగన్ వర్గం ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications