రామోజీరావు ఆటలు సాగవంటున్న వైయస్ జగన్ సాక్షి

వైయస్ జగన్ ను సాధ్యమైనంత త్వరగా బలిపీఠం ఎక్కించాలని ఎల్లో రాతలు రాస్తున్నారని సాక్షి విమర్శించింది. జగన్ పై ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు రోజుకో కట్టు కథ అల్లుతున్నాయని విరుచుకుపడింది. జగన్ కు లభిస్తున్న ప్రజల ఆదరణను చూసి ఓర్వలేక ఏడ్పు రాతలు రాస్తున్నారని వ్యాఖ్యానించింది. జగన్ లో ప్రజలు మహానేతను చూసుకుంటున్నారని చెప్పుకుంది. ఎల్లో ఎజెండా పేరుతో రామోజీపై, రాధాకృష్ణపై సాక్షి దుమ్మెత్తి పోసింది. ఎల్లో ఎజెండాను మానుకోవాలని సలహా ఇచ్చింది. జగన్ చూసి పల్లెలు పులకరిస్తున్నాయని ప్రశంసించింది.












Click it and Unblock the Notifications