వైయస్ జగన్ పై చర్యలుండవని ఎవరు చెప్పారు: డి శ్రీనివాస్

Srinivas
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై చర్యలుండవని ఎవరు చెప్పారో తెలియదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. జగన్ పై చర్యలుండవని ఎఐసిసి వర్గాలు చెప్పినట్లు వచ్చిన వార్తలపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా అన్నారు. జగన్ వ్యవహారాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. ప్రచారాలను నమ్మితే మనుషులు పిచ్చివాళ్లవుతారని ఆయన అన్నారు. వార్తల్లో ఉంటేనే నాయకులుగా చెలామణి అవుతామనేది పొరపాటు అని ఆయన అన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కె. రోశయ్య చూసుకుంటారని ఆయన అన్నారు.

పార్టీ నాయకులకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండడం తప్పు కాదని, అయితే వాటిని బహిరంగంగా వెల్లడించడం పార్టీ వ్యతిరేకమని ఆయన అన్నారు. పార్టీ నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకూడదని ఆయన హెచ్చరించారు. పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి నివేదిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలను కూడా అధిష్టానానికి చేరవేస్తున్నట్లు ఆయన చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+