తెలంగాణ పార్లమెంటు సభ్యులపై సిఎం రోశయ్య ఆగ్రహం
కాగా, సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు కూడా తెలంగాణ ఎంపిలపై బహిరంగంగానే మండిపడుతున్నారు. తెలంగాణ ఎంపిలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, తెరాసతో చేతులు కలిపారని, దీనిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తామని వారన్నారు. అయితే, దీనిపై కాంగ్రెసు తెలంగాణ ఎంపిలు ఎదురు దాడికి దిగుతున్నారు. పార్లమెంటు సభ్యుడు వివేక్ నివాసంలో మంగళవారం రాత్రి విందు సమావేశంలో తెలంగాణ ఎంపిలు ఆ విషయాలపై చర్చించినట్లు సమాచారం. సీమాంధ్ర ఎంపిలే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణకు అనుకూలంగా కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనపై ఆందోళనకు దిగి సీమాంధ్ర నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారంటున్నారు. ఏమైనా, ఎపిపిఎస్సీ పరీక్షతో మరోసారి కాంగ్రెసు ప్రాంతాలవారీగా చీలిపోయింది.
Story first published: Wednesday, September 8, 2010, 11:00 [IST]