కాంగ్రెసులో తెలంగాణ కలవరం: ప్రజాప్రతినిధులకు డి శ్రీనివాస్ లేఖ

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సంయమనం పాటించాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వ్యక్తిగతంగా రాసిన లేఖల్లో ఆ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కట్టుబడి ఉన్నారని డీఎస్ అందులో పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే పనిలో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతల పరస్పర విమర్శలు, ప్రకటనలు ప్రాంతీయ ద్వేషాలు రగిల్చే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు తమ అభిప్రాయాలను అంతర్గతంగా వెల్లడించాలి తప్ప, మీడియాకు ఎక్కి అనవసర విమర్శలు చేయవద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications