హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీలో కొనసాగుతున్న తెలంగాణ న్యాయవాదుల నిరాహార దీక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Lawyers
హైదరాబాద్: హైకోర్టులో తమ వాటాకోసం నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ న్యాయవాదులు సత్యంరెడ్డి, జ్యోతికుమార్, విజయ్ కుమార్ లు గాంధీ ఆసుపత్రిలో తమ దీక్షను కొనసాగిస్తున్నారు. 42 శాతం వాటాకోసం న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారంతో 5వ రోజుకు చేరుకున్నాయి. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ముగ్గురు న్యాయవాదులు సత్యంరెడ్డి, జ్యోతికుమార్, విజయ్ కుమార్ లను శుక్రవారం తెల్లవారుజామున 2.30 నుంచి 3.00 గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా వారి దీక్ష భగ్నం చేయటానికి యత్నించారు. వారు ఎంతకు ఒప్పుకోకపోవటంతో వారు కాదంటున్నా దౌర్జన్యంగా చికిత్స నిమిత్తం ముషీరాబాద్ లోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించారు.

అయితే న్యాయవాదులు మాత్రం తమ దీక్షను గాంధీ ఆసుపత్రిలోనే కొనసాగిస్తున్నారు. వారు వైద్యానికి నిరాకరిస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి భారీ సంఖ్యలో లాయర్లు అక్కడికి తరలి వస్తున్నారు. హైకోర్టులో ముగ్గురు న్యాయవాదులు దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నించటంతో మిగతా వారు కొనసాగించడానికి సిద్ధపడ్డారు. అయితే దానిని పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు వద్ద ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా హైకోర్టు న్యాయమూర్తి నాగార్జునరెడ్డి రాజీనామాను ఉపసంహరించుకోవాలని పలువురు కోరుతున్నారు. అయినప్పటికీ ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకోవడానికి తిరస్కరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X