తెలుగు చిత్ర దర్శక నిర్మాత కెబి తిలక్ కన్నుమూత

ఆయన ఎల్వీ ప్రసాద్ కు సమీప బంధువు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన జైలుకు వెళ్లారు. రాజమండ్రి జైలులో ఆయనను పెట్టారు. కొల్లేటి కాపురం, ఎమ్మెల్యే, ఈడు-జోడు, పంతాలు - పట్టింపులు, ఉయ్యాల - జంపాల వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ నటి, ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు జయప్రదను వెండితెరకు పరిచయం చేసింది తిలకే. ఆయన భార్య ఇప్పటికే మరణించారు. కుమారుడు అమెరికాలో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications