శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ బావమరిది రవీంద్రానాథ్ రెడ్డిపై ఎర్రంనాయుడు ధ్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
శ్రీకాకుళం: వైయస్ బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు ఎర్రంనాయుడు విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణాల్లో కూరుకు పోయిందని విమర్శించారు. రవీంద్రనాథ్ రెడ్డితో పాటు పలువురు వైయస్ బంధువులు, ఆయన సన్నిహితులు వైయస్ అండ చూసుకొని కోట్లకు పడగలెత్తారన్నారు. అప్పుడు సంపాదించుకున్న డబ్బులతో ఇప్పటికీ వారు పెట్టుబడులు పెట్టి వివిధ వ్యాపారాలు చేస్తున్నరని, అదంతా అక్రమ సంపాదనే అన్నారు. పేద ప్రజలను పిప్పి చేసి, వారిని సంక్షేమ పథకాల ముసుగులో మభ్యపెట్టి కోట్లు దండుకున్నారన్నారు.

భారీ కుంభకోణాలకు పాల్పడ్డ వైయస్ బావమరిది రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి, ఆయన్ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. వైయస్ హయాంలో కాంగ్రెస్ నాయకులు చేసిన కుంభకోణాలకు లెక్కే లేదని, వారందరినీ జైల్లో పెట్టాల్సి వస్తే ఇప్పుడున్నని సరిపోవని, మరికొన్ని జైళ్లు నిర్మించాల్సిన ఆవసరం వస్తుందని ఎర్రంనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యకు అనుకోకుండా ఆ పదవి వచ్చిందని ఆయన ఎప్పుడూ దానిని ఎలా రక్షించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు తప్పితే రాష్ట్రం గురించి ఆలోచించటం లేదన్నారు. పదవి కోసం ఆయన అక్రమాలకు పాల్పడ్డ వారిని చూసీ చూడనట్లూ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X