వైయస్ ఆలీబాబా 40 దొంగల్లా దోచుకున్నారు: చంద్రబాబు నాయుడు

YS Rajasekhar Reddy
అనంతపురం: అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత కాంగ్రెస్ పై దుమ్నెత్తి పోస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నిండా ముంచాడని, సామాన్యుల కడుపు కొట్టి వారి కుటుంబం కోట్లకు పడగలెత్తిందని విమర్శించారు. సంపదనంతా బావమరిది కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి, కొడుకు జగన్మోహన రెడ్డికి దోచి పెట్టాడన్నారు. వైయస్ పాలించిన ఐదున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణాల్లో కూరుకు పోయిందన్నారు. వ్యోక్సవ్యాగన్, భారతి, సరస్వతి, హరితలలో ఇలా అన్నింటిలోనూ ఆక్రమాలే జరిగాయన్నారు. ఆయన హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలీబాబా 40 దొంగల్లా రాష్ట్రంపై పడి దోచుకు తిన్నారని, ఇప్పుడు సైతం ముఖ్యమంత్రి రోశయ్య తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భయపడి అక్రమార్కులను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నాడన్నారు. దేశంలోనే ఎవరూ చేయని అవినీతిని వైయస్ చేశారన్నారు.

ఆంతకుముందే భారీ కుంభకోణంగా పేరుగాంచిన వోక్స్‌ వ్యాగన్‌ విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికార కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం జరిగిందని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. ఆయన అనంతపూర్ జిల్లా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. సీబీఐ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించడం వల్లనే బొత్స సత్యనారాయణ బయటపడ్డారన్నారు. ఈ కుంభకోణంలో బొత్స హస్తం ఉందని ప్రభుత్వానికి తెలుసునని, అయినప్పటికీ బొత్సను బయటకు లాగితే తమ పార్టీలోని చాలామంది బయట పడతారని ప్రభుత్వానికి తెలుసునని, అందువల్లనే బొత్సను ఇందులోనుండి తప్పించే ప్రయత్నలు చేసిందన్నారు.విచారణ పేరుతో సిబిఐకి కేసును అప్పగించి సిబిఐను ఆబాసుపాలు చేసిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+