చంద్రబాబు ఎన్టీఆర్ ను చంపిన రాక్షుడు: అంబటి రాంబాబు

వైయస్ రాజశేఖర్ రెడ్డి కన్నా ముందే బాబు తన పిల్లనిచ్చిన మామకే అన్యాయం చేశాడని ఆ బాధతోనే ఆ మహానుభావుడు మరణించాడని పేర్కొన్నారు. పదిహేనేళ్ల క్రితం ఎన్టీరామారావును అన్యాయంగా గద్దె దించి తాను ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడని, అలాగే 1999లో బిజెపితో పొత్తు పెట్టుకొని గెలిచాడు. కాని బాబు సొంతంగా అధికారంలోకి వచ్చింది ఎన్నడూ లేదన్నాడు. మామకె వెన్నుపోటు పొడిచి ఆయన్ను చంపిన పెద్ద రాక్షసుడు బాబు అని, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత ఆయనకు లేదని అంబటి విమర్శించారు.
వైయస్ ను అలీబాబా 40 దొంగలు అనటంతోనే ఆయన ఆజ్జానం బయట పడుతోందన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్రం యావత్తు అభినందిస్తే ఆయన మాత్రం వైయస్ ను అవినీతిపరుడని వ్యాఖ్యానించడం ఆయన అజ్జానానికి నిదర్శనమన్నారు. బాబు హయాంలోనే అవినీతి జరిగిందనడానికి స్విస్ బ్యాంకులో ఉన్న తెలుగు దేశం పార్టీ నాయకుల అక్రమ సంపాదన, సింగపూర్ హోటల్లలో బాబుకు ఉన్న పెట్టుబడులే నిదర్శనమన్నారు. వైయస్ ను జగన్ లో చూసుకుంటూ జనం ఆయనకు బ్రహ్మరధం పడుతుంటే దానిని జీర్ణించుకోలేని బాబు తనకు జగన్ రాజకీయంగా అడ్డు వస్తాడనే ఉద్దేశ్యంతోనే ఆవాకులు చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications