తెలంగాణ కోసం రంగారెడ్డి జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

సంవత్సర కాలంనుండి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది. విద్యార్థులు, తెలంగాణవాదులు తెలంగాణ రావాలని రాసుకొని ఆత్మహత్యలకు పూనుకున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు, చివరకు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయితే తెరాసతో పాటు పలువురు తెలంగాణవాదులు తెలంగాణను పోరాడి సాదిద్ధాం మరణించి కాదని, ప్రాణాలర్పించి కాదు, తెలంగాణను కళ్లారా చూద్దామని చెబుతున్నప్పటికి యువతరం ఆవేశంలో నిర్ణయం తీసుకుంటుంది. మూడు రోజులు క్రితం కూడా కరీంనగర్ లో ప్రవీణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు రోజు వరంగల్ లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పూనుకున్నాడు. తీవ్రగాయాలు కావటంతో ఆయనను హాస్పిటల్ కు తరలించారు. మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించాడు.












Click it and Unblock the Notifications