తన ప్రత్యర్థులు కొజ్జాలని అంటున్న ఎంపి వైయస్ జగన్

YS Jagan
ఒంగోలు: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన ప్రత్యర్థులను కొజ్జాలుగా అభివర్ణించారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నవారికి మగతనం లేదని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో ఆయన తన ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరణించిన నాయకుడి మీద ఆరోపణలు చేస్తున్నారని, చనిపోయిన వ్యక్తి వచ్చి సమాధానాలు చెప్పలేడనే ఉద్దేశంతోనే వారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. బతికి ఉన్నవారి మీద బతికి ఉన్న నాయకులు ఆరోపణలు చేస్తారని, కానీ మరణించిన తన తండ్రిపై వారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు సీనియర్ నాయకులను, ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల నాయకులను ఉద్దేశించి ఆయన ఆ విధంగా అన్నారు.

కాగా, అంతకు ముందు రోజు ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర రావు నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఈ ఓదార్పు యాత్ర సందర్భంగా ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర రావు స్వగ్రామం కారంచేడులో ప్రసంగించలేదు. అలాగే, ముఖ్యమంత్రి కె. రోశయ్య స్వగ్రామం కారంచేడులో కూడా ఆయన ప్రసంగించలేదు. రోశయ్య స్వగ్రామం స్వర్ణ కూడా పర్చూరు నియోజకవర్గంలోకి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+