తెరాస అధినేత కెసిఆర్ సోనియా గాందీ తొత్తు: నామా నాగేశ్వరరావు ఫైర్

బిల్లు పెడితే ఓటు వేయకుంటే తెలుగు దేశం తప్పు అవుతుందని, కాని మేం తెలంగాణకు అనుకూలం కాబట్టి బిల్లు ప్రవేశ పెడితే మొదటి ఓటు మేమే ఓటు వేస్తామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పకముందే ఆమె చెప్పింది అని కెసిఆర్ అనడాన్ని బట్టి చూస్తుంటే ఆమెకు తొత్తుగా వ్యవహరిస్తున్నట్టున్నాడని అన్నారు. తెలంగాణ బిల్లును కూడా ప్రవేశ పెట్టలేని కాంగ్రెస్ కు మళ్లీ ఆయన అనుకూలంగా మాట్లాడటం ప్రారంభింటాడని, ఇందులో ఏదో మతలబు ఉందని ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు.
సోనియా తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఇంత వరకు నోరు ఎందుకు మెదపటం లేదని, బిల్లును ప్రవేశ పెట్టడానికి చొరవ ఎందుకు తీసుకోవటం లేదో కెసిఆర్ సమాధానం చెప్పాలన్నారు. అంతే కాకుండా ఒకసారి సోనియాను తిట్టడం, మరోసారి పొగుడుతున్న కెసిఆర్ కూడు ఎప్పుడైనా బిల్లు ప్రవేశ పెట్టమని అడిగాడా అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న తెలంగాణపై చిదంబరం ప్రకటన చేస్తే మొదట రాజీనామా చేసింది కాంగ్రెస్ ఎంపీనే అని, అయినా ఎవరి ప్రాంతంపై వారికి అభిమానం ఉంటుందని అన్నారు. ప్రజల ప్రాంతీయ ఆభిమానాలను బట్టి ఆయా రాజకీయ నాయకులు నిర్ణయం తీసుకుంటారన్నారు.












Click it and Unblock the Notifications