కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు బీహారీ కార్మికుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool District
కర్నూలు: కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం పందిపాడులో గల స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు సజీవ దహనమయ్యారు. గాయపడిన మరో ఇద్దరు కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్టీల్ ప్లాంట్ లోని ద్రవపూరిత ఐరన్ ఫర్నేస్ పగిలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మరణించిన కార్మికులు బీహార్ రాష్ట్రానికి చెందినవారు.

ఫర్నేస్ పగిలిపోవడంతో ద్రవరూపంలో ఉన్న ఇనుము కార్మికులపైకి దొర్లింది. దీంతో కార్మికులు మరణించినట్లు సమాచారం. అది వేయి డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్లాంట్ మధుసూదన్ అనే రాజకీయ నాయకుడికి చెందిందని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X