తెలంగాణ ఇవ్వకపోతే మానవ బాంబులు అవుతాం: కె చంద్రశేఖర రావు

తెలంగాణ వాదులంతా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరుకుంటుంటే యూపీఏ సర్కార్ ఆంధ్ర పాలక నేతలకు తలొగ్గి నాన్చుడు ధోరణి అవలంబించడం సరైంది కాదని చెప్పారు. ఒకరిద్దరు నేతల ఒత్తిళ్లతో యూపీఏ సర్కార్ నిర్ణయంలో వెనుకడుగు వేసిందన్నారు. లగడపాటి జగడపాటి చూపిన డబ్బు ఎర తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముందు పనికి రాదన్న విషయం త్వరలోనే తేలనుందని చెప్పారు. యూపీఏ సర్కార్ ఇక బుజ్జగింపు ధోరణి, అణచివేసే వైఖరి అవలంబించకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నీతి, నిజాయితీ, నియమాలు లేని ఆంధ్ర పాలకులు ఇప్పటికైనా తమ దోపిడీ విధానాలకు స్వస్తి పలకాలని సూచించారు. తెలంగాణలోని కాంగ్రెసు, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలను దద్దమ్మలు, సన్నాసులు, చాతగాని వారిగా ఆయన అభివర్ణించారు. వీరి వ్యవహార శైలి మూలంగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతున్నదన్నారు.












Click it and Unblock the Notifications