వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేటే మాఫియా ఏర్పడింది: మైక్రో ఫైనాన్స్ సంస్థలపై చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మైక్రో ఫైనాన్స్ సంస్థలకు సంబంధించి ప్రైవేట్ మాఫియా ఏర్పడి పేదల రక్తం పీలుస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మైక్రో ఫైనాన్స్ ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు. మైక్రో ఫైనాన్స్ లను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలనుకోవడం, మారిటోరియం విధించడం కంటి తుడుపు చర్యలు మాత్రమేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టేందుకే ఆ చర్యలకు పూనుకుందని, అది పరిష్కారం కాదని ఆయన అన్నారు.

మైక్రో ఫైనాన్స్ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ల వల్ల మైక్రో ఫైనాన్స్ వలలో పేదలు చిక్కుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. మైక్రో ఫైనాన్స్ చట్టాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, 40 నుంచి 60 శాతం వడ్డీరేట్లు విధిస్తున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X