వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ ఓదార్పు యాత్ర నేతల మధ్య పెట్టిన చిచ్చు
తాను బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా అధిష్ఠానం నిర్ణయం మేరకు కడప ఎంపీ వైఎస్ జగన్ చేపట్టే ఓదార్పు యాత్రలో పాల్గొనడం లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం సాయంత్రం మీడియాతో చెప్పారు. "మా కుటుంబ సభ్యులెవరూ ఓదార్పులో పాల్గొనరు. కొడుకు అటువైపు.. కూతురు ఇటువైపు పోవడం లాంటివి జరగవు'' అని స్పష్టం చేశారు. పీసీసీ కార్యదర్శి శ్రీధర్రెడ్డిపై చర్య తీసుకోవాలని తాము కోరామనడం హాస్యాస్పదమన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు జగన్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై విరుచుకుపడుతున్నారు.
Comments
Story first published: Thursday, October 14, 2010, 9:20 [IST]