బలపరీక్షలో మరోసారి నెగ్గిన కర్ణాటక సిఎం యెడ్యూరప్ప

Yeddyurappa
బెంగళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరోసారి శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గారు. గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ ఆదేశాల మేరకు ఆయన రెండోసారి గురువారం బలపరీక్షకు సిద్ధపడ్డారు. గురువారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశమైంది. తీవ్ర గందరగోళం మధ్య యడ్యూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా శానససభ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసుల వైఖరి పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. శాసనసభ చరిత్రలో పోలీసులు సభలోకి రావడం ఇదే మొదటిసారి అని కాంగ్రెసు నాయకుడు సిద్ధరామయ్య అన్నారు. మార్షల్స్ బలం కూడా పెంచారు. యడ్యూరప్ప నెగ్గడానికి 105 మంది సభ్యుల బలం అవసరం కాగా ఆయనకు 106 మంది ఓటేశారు. దీంతో ఆయన సునాయసంగా విశ్వాస పరీక్షలో నెగ్గారు.

16 మంది తిరుగుబాటు శాసనసభ్యులకు ఓటు హక్కు లేకపోవడంతో యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గడం సులభంగా మారింది. 16 మందిపై అనర్వహత వేటు పడడంతో సభలో సభ్యుల సంఖ్య 208 ఉంది. ఇందులో కాంగ్రెసు సభ్యులు 73 మంది కాగా, జెడిఎస్ సభ్యులు 28 మంది. ఓ జెడిఎస్ సభ్యుడొకరు యడ్యూరప్పకు మద్దతు ప్రకటించారు. దీంతో యడ్యూరప్ప విజయం నల్లేరు మీద నడకే అయింది. దీంతో బిజెపి తన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగింది. విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని సిద్ధరామయ్య కోరారు. అయితే ఓటింగులో కాంగ్రెసు పాల్గొన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+