Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ర యుద్ధానికి దేవరగట్టు సిద్ధం: ఆందోళనలో పోలీసులు

kurnool
కర్నూలు: దసరా సందర్భంగా కర్నూలు జిల్లాలోని దేవరగట్టు మరోసారి కర్రల యుద్ధానికి సిద్ధమయ్యింది. దసరా రోజు దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి దేవుడిని తమ సొంతం చేసుకోవడానికి మూడు గ్రామాల ప్రజలు కర్రలు పట్టుకొని వచ్చి ఒకరిపై ఒకరు నిర్దాక్షిణ్యంగా కొట్టుకొని గెలిచిన వారు మాలమల్లేశ్వరస్వామిని దక్కించుకుంటారు. అయితే ఇలా దేవుడి పేరుతో కొట్టుకోవటాన్ని పోలీసులు ఆపేందుకు ప్రతి దసరాకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని అందుకు ఆయా గ్రామస్తులు ఒప్పుకోవటం లేదు.

కర్రలతో కొట్టుకొని దేవుడిని దక్కించుకోవటం తాము ఇప్పుడు చేస్తున్నది కాదని, తమకు ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోందని చెబుతున్నారు. కర్ర యుద్ధాన్ని ఆపడానికి పలువురు ఉద్యమాలు చేశారు. పోలీసులు, ప్రభుత్వం ఆ మూడు గ్రామాల ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చింది. అయినప్పటికీ వారు తమ సంప్రదాయాన్ని మానుకునేది లేదంటి చెప్పుతున్నారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు కనీసం కొట్టుకోవడానికి వాడే కర్రలకు ఇనుప వస్తువులు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోక పోవటంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో అక్కడ పోలీసులను మోహరిస్తోంది. వారు కొట్టుకోకుండా పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేయటం, కర్రలతో యుద్ధానికి దిగినప్పుడు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించటం చేస్తున్నారు. అంతేకాని ఆయా ప్రజలకు ఇప్పటి వరకు చైతన్యం చేయలేకపోయారు. అందుకే అక్కడి పోలీసులకు దసరా వచ్చిందంటే దేవరగట్టు భయం పట్టుకుంటుంది. ఎప్పటిలాగే ఈసారీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో ఆదివారం జరిగే దేవరగట్టు ఉత్సవానికి భారీ సంఖ్యలో పోలీసులు వెళ్లారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+