వైయస్ జగన్ ఇష్యూతో సహా సమస్యలన్నీ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాతే

BN Srikrishna
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన సమస్యలన్నింటినీ శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే పరిష్కరించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ధిక్కారంపై కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న నేతలపై పిసిసి పరిధిలో ఉన్నంత మేరకు చర్యలు తీసుకోవడం కేవలం జగన్ ఓదార్పు యాత్ర ఉధృతిని తగ్గించడానికి మాత్రమేనని, వాస్తవంగా ఇప్పుడు చర్యలు తీసుకునే ఉద్దేశంతో అధిష్టానం లేదని అంటున్నారు. ప్రభుత్వపరమైన, పార్టీపరమైన సమస్యలన్నింటికీ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతనే పరిష్కారం చూడాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు దేన్ని పట్టుకున్నా తేనె తుట్టెను కదిలించినట్లే అవుతుందని, తెలంగాణ సమస్యతోనే అన్ని సమస్యలు ముడిపడి ఉన్నాయని, అదే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

డిసెంబర్ 31వ తేదీలోగా రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనుంది. అంత వరకు మంత్రి వర్గ విస్తరణ కూడా చేపట్టకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కె. రోశయ్యకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇదే విషయం చెప్పారని తెలుస్తోంది. అయితే, మంత్రివర్గ విస్తరణ ఉండదనే కచ్చితంగా చెప్తే పదవులు ఆశిస్తున్న శాసనసభ్యులు జారిపోయి వైయస్ జగన్ శిబిరంలో చేరుతారనే అంచనాతో ఆ విషయాన్ని వెల్లడించడం లేదని భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ రేపో మాపో, ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఉంటుందంటూ ప్రచారం పెట్టడం ద్వారా శాసనసభ్యులను కట్టి పడేయాలనే ఎత్తుగడను మాత్రమే పార్టీ అధిష్టానం అనుసరిస్తోందని చెబుతున్నారు.

విజయవాడలో హైకోర్టు బెంచ్ కోసం డిమాండ్ చేస్తున్న న్యాయవాదులకు ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పిన విషయం కూడా అందుకు అనుగుణంగానే ఉంది. ఈ డిమాండ్ పై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు ఆగాలని ఆయన న్యాయవాదులకు సూచించారు. తెలంగాణ అంశంపై తేల్చుకునేందుకే కోస్తాంధ్ర న్యాయవాదులు హైకోర్టు బెంచ్ సమస్యను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైకోర్టు కోసం మాట్లాడాల్సి ఉంటుంది. బెంచ్ ను అడగడం ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణవాదులు అంటున్నారు. ఏమైనా, రాష్ట్ర సమస్యలన్నింటికీ శ్రీకృష్ణ కమిటీయే పరిష్కారం చూపుతుందనే భావన కొంత మందిలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+