టీడీపీ నేత గాలి ఇంటిముందు కాంగ్రెసు నాయకుల ఆందోళన: దిష్టిబొమ్మ దహనం

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: కాంగ్రెసు నేతలను చీపుర్లతో కొట్టాలన్న తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇంటిముందు బుధవారం ఉదయం కాంగ్రెసు నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి అధికార ప్రతినిధి రాహుల్ గాంధీల జోలికి వస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. సూక్ష్మరుణ సంస్థలన్ని చంద్రబాబు హయాంలోనే వచ్చినవనే విషయాన్ని గాలి గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులనన్నింటినీ కాంగ్రెసు పై రుద్దుతూ టీడీపీ వారు లాభ పడాలని చూస్తున్నారని వారిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

గాలి ముద్దుకృశ్ణమనాయుడు తాను చేసిన వాఖ్యలను వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెసు నాయకులు గాలి ఇంటిముందు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గాలి చేసిన వాఖ్యలను మంగళవారం ప్రభుత్వ చీప్ విప్ శైలజానాథ్, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మంగళవారమే ఖండించారు. పావలా వడ్డీ, స్వయం సహాయక సంఘాలకు రుణాలను ఇచ్చి ఆదుకునేందుకు కాంగ్రెసు ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+