రాయపాటిపై కోటి రూపాయలకు కన్నా లక్ష్మినారాయణ పరువు నష్టం దావా

నష్టపరిహారంతో పాటు రాయపాటి ఇకపై ఆరోపణలు చేయకుండా శాశ్వత ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇప్పించాలని కూడా పిటిషన్లో కోరారు. సీనియర్ న్యాయవాది ఆరెగకూటి సంజీవరెడ్డితో మంగళవారం జిల్లా కోర్టులో దావా వేశారు. కోర్టు ఫీజుగా లక్ష రూపాయలు చెల్లించారు. మంత్రి కన్నాను మధు కోడాతో పోలుస్తూ ఎంపీ రాయపాటి అవినీతి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 21న తన న్యాయవాదితో రాయపాటికి లీగల్ నోటీస్ జారీ చేశారు. అయితే, మూడు నెలలు గడచినా దానిపై రాయపాటి స్పందించలేదు. రోశయ్య మంత్రివర్గంలో అవినీతిపరులున్నారని, వారిని తొలగించకపోతే పార్టీకి భవిష్యత్తులో పరాజయం తప్పదని ధ్వజమెత్తారు. దీంతో మంత్రి కన్నా పరువు నష్టం దావా దాఖలు చేశారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications