ఖమ్మంలో పోలీసుల ఆయుధాల ప్రదర్శనలో అపశృతి: విద్యార్థి మృతి

Khammam Dist
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో పోలీసుల ఆయుధాల ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది. ప్రదర్శనలో అనుకోకుండా ఒక తుపాకి పేలి ఒకరు చనిపోగా, ముగ్గురుతీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని వేలేరుపాడులో పోలీసుల తుపాకుల ప్రదర్శనలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో తూటాలు తగిలింది. దీంతో పదోతరగతి విద్యార్థి వెంకటకృష్ణ మృతి చెందాడు. ఎనిమిదో తరగతి విద్యార్థి సాయిబాబుతో పాటు మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిహారం కోసం వెంకటకృష్ణ మృతదేహంతో వేలేరుపాడు పీఎస్‌ వద్ద తల్లిదండ్రులు, అఖిలపక్షం నేతలు ఆందోళన చేస్తున్నారు.

కాగా డిజిపి అరవిందరావు ఈ ఘటనపై హైదరాబాద్ లో స్పందించారు. ఇది కావాలని చేసింది కాదని, అనుకోకుండా జరిగిందన్నారు. తుపాకి పేలుడు ఘటనకు కారకుడైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బుల్లెట్ లోడు చేసినద తుపాకితో ప్రదర్శన నిర్వహించి ఆ పోలీసు తలకాయ లేని పనిచేశాడన్నారు. విద్యార్థులకు తుపాకీలో తుటాలు పెట్టి అవగాహన కల్పించమని ఎప్పుడూ చెప్పలేదని, సదరు పోలీసు బుల్లెట్లు పెట్టి తెచ్చి ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+