హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంజారాహిల్స్ లోని మినిస్టర్స్‌క్వార్టర్స్‌ను ముట్టడించిన బిఇడి విద్యార్థులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

BEd Students
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా మెరిట్ ప్రకారమే 2008 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉద్యమిస్తున్న బిఇడి విద్యార్థులు ఆదివారం ఉదయం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే విద్యార్థుల ప్రయత్నాలు చేసిన పోలీసులు అడ్డుకున్నారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.అయినప్పటికీ మిగినిన విద్యార్థులు అక్కడే ఆందోళన చేస్తున్నారు.విద్యార్థి సంఘం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ముట్టడిని చేశారు.

కాగా మెరిట్ ప్రకారమే ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరాహార దీక్ష చేపట్టి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్, జ్యోతిల పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు బిఇడి విద్యార్థులు ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం క్షీణించిందని వారిని పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చేర్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X