వైయస్ జగన్ రూట్ క్లియర్: హైకమాండ్ పై అంబటి తీవ్ర వ్యాఖ్యలు

YS Jagan
హైదరాబాద్: జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు పార్టీ అధిష్టానం మీద మరోసారి తిరుగుబాటు స్వరం వినిపించారు. అధిష్టానంపై, ముఖ్యమంత్రి కె. రోశయ్యపై గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాజ్యసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలు, గురువారం అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే వైయస్ జగన్ అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకే నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఏపీఐఐసిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో లేక పోవటం తెలుగు ప్రజలను అవమానించినట్లేనని ఆయన గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ ను ఏఐసిసి విస్మరించటం దారుణమన్నారు.వైఎస్ ఫొటో పెట్టకపోవడంపే ఏఐసిసి వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా యువజన కాంగ్రెస్ లో పదవుల కోసం బేరాలు జరిగాయని ఆయన అన్నారు.మంత్రులకు క్యారెక్టర్ లేదన్ని ముఖ్యమంత్రి వాఖ్యలు పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. ఎమ్మార్ సమాచారం శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డికి ఇచ్చి మాట్లాడించింది రోశయ్యేనని ఆయన విమర్శించారు. డిఎల్ రవీంద్రారెడ్డి చేత సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయించింది కూడా రోశయ్యేనని ఆయన అన్నారు. టాలెంట్ హంట్ ద్వారా యువజన కాంగ్రెసు పదవుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. టాలెంట్ హంట్ పేరుతో వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ అభిమానులను పదవులకు దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+