హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రహేజా, ఎమ్మార్ ల పాపం చంద్రబాబునాయుడిదే: దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: రహేజా, ఎమ్మార్ ల పాపం తెలుగు దేశం పార్టీ హయాంలోనే చోటు చేసుకుందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పాపానికి ఎక్కడ బాధ్యత వహించవలసి వస్తుందోనని దానిని కాంగ్రెస్ పై రుద్దుతున్నాడన్నారు. పేదల ఇళ్ల క్రమబద్దీకరణలో ఎలాంటీ రాజీ లేదని దానం చెప్పారు. ఈ నెల 14నుండి 19 వరకు దివంగత ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు.

కేబినెట్ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి బొత్సకు తనకు మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదని, మంత్రుల మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. వాదన జరిగినట్టు మీడియాలో వచ్చింది కాబట్టే తాను వివరణ ఇస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య కేబినట్లో చర్చించుకున్నవి బయట చెప్పటం సరికాదని సూచించారని అలా చెప్పటం మంచిదేనని దానం అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X