హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుగ్గల్ ను శ్రీకృష్ణ కమిటీ నుండి తప్పించాలి: దామోదర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
నల్గొండ\హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు వి కె దుగ్గల్ సుబ్బిరామిరెడ్డి వంటి సీమాంధ్రుల ఇళ్లకు విందుకు వెళ్లడం తెలంగాణ ప్రజల్లో అనుమానాలకు తావిస్తుందని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి అన్నారు. నిష్పక్షపాత ఫలితం కోసం కేంద్రం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందని, అయితే కమిటీలోని సభ్యులు ఇలా అనుమానాలకు తావిచ్చేలా ప్రవర్తించటం బాగాలేదన్నరు. ఈ విషయాన్ని కేంద్రానికి, కమిటీకి వెంటనే రిపోర్టు చేస్తామని చెప్పారు. సీమాంధ్ర నాయకుల ఇళ్లకు విందుకు వెళ్లిన దుగ్గల్ వెంటనే కమిటీ నుండి తప్పుకోవాలని ఆయన డిమాండు చేశారు. లేకుంటే కమిటీయే ఆయనను తప్పించాలని కోరారు.

కాగా శ్రీకృష్ణ కమిటీపై ఎలాంటి అపోహలు, అపనమ్మకాలు పనికిరాదని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. అయితే దుగ్గల్ తనపై ఎలాంటి అపోహలు లేకుండా చూసుకోవాలని సూచించారు. నివేదిక గడువు దగ్గరపడుతున్న సమయంలో దుగ్గల్ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X