హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ లోనే తెలుగు పౌరుషం ఉంది: లక్ష్మీపార్వతి ప్రశంస

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో తాను పాల్గొనడాన్ని స్వర్గీయ ఎన్టీ రామరావు సతీమణి లక్ష్మీపార్వతి సమర్థించుకున్నారు. ఎన్టీఆర్, వైయస్సార్ ల మాదిరిగా ఒక్క వైయస్ జగన్ లోనే తెలుగు పౌరుషం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఎదుర్కుంటూ ఆమె వైయస్సార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలోబియ్యం పథకాన్ని చంద్రబాబు నీరు గార్చిన విషయంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ పథకాన్ని వైయస్సార్ అమలు చేశారని, అందుకే తాను వైయస్సార్ ను సమర్థించానని ఆమె చెప్పుకున్నారు.

ముఖ్యమంత్రి రోశయ్య సోనియా గాంధీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని, తెలుగు గౌరవాన్ని ఆమె వద్ద తాకట్టు పెడుతున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. కాంగ్రెసు నాయకులు ఇందిరా గాంధీ వద్ద తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ మాదిరిగా ఆత్మగౌరవాన్ని ప్రదర్శిస్తూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి సోనియా వద్ద మోకరిల్లడానికి జగన్ నిరాకరిస్తున్నారని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X